
రాజన్నసిరిసిల్ల, వెలుగు:-- మిడ్మానేరు మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి ఇరిగేషన్ ఆఫీసర్లు మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. నీటి విడుదలను కలెక్టర్ సందీప్కుమార్ఝా పరిశీలించారు. రెండు రోజుల కింద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంటలకు సాగునీరు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
దీంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 0.75టీఎంసీల నీరు ఉండగా.. బోయినపల్లి మండలం మిడ్ మానేర్ నుంచి 0.5 టీఎంసీలు విడుదల చేశారు. మల్కపేట రిజర్వాయర్కు నీరు చేరుకోగానే అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట మండలం మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తారు.